28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకురాలు స్వరూప రాణి జెండా ఎగురవేసి మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ఆవిర్భవించిందని తెలిపారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడి ఎందరో త్యాగాలు చేశారని పేర్కొన్నారు. నిజాం కు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగం తరఫున పోరాటం చేసి సువర్ణ అక్షరాలతో చరిత్రలో నిలిచిందని అన్నారు.  తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆటపాట మాటలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించిన పార్టీ సిపిఐ అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని లేకుంటే ఉద్యమాలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు విజయమ్మ, సలీం, వెంకటేష్, శంకర్, దత్తు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article