నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అధికార లాంఛనాల మధ్య హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. ఐజీ చంద్రశేఖర్రెడ్డి, సీపీ సాయిచైతన్య మృతుడికి నివాళులర్పించారు. రౌడీషీటర్ రియాజ్ను స్టేషన్ తరలిస్తున్న క్రమంలో నగరంలోని వినాయక్నగర్లో కానిస్టేబుల్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందాడు.పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం పోలీస్ శాఖ లాంఛనాలతో అంతిమయాత్రను నిర్వహించారు. నగరంలోని కంఠేశ్వర్లోని న్యూ బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రమోద్ స్వగృహానికి ఇన్స్పెక్టర్ జనరల్ చంద్రశేఖర్ రెడ్డి చేరుకొని నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అధికారిక లాంఛనాల మధ్య ప్రమోద్ అంత్యక్రియలు నిర్వహించారు. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డితో పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు, నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు, భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

