నందిపేట్, బతుకమ్మ :
నందిపేట్ మండల పరిధిలోని ఖుదావంద్ పూర్ గ్రామంలో 135వ బూత్ లో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను శనివారం ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్ తో పాటు బిఎల్ఓ మెట్టు గోపి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు సుంకరి శ్రీనివాస్, స్థానికులు పాల్గొన్నారు.
