వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ కేటీఆర్, కవితలపై సీఐడీ కి ఫిర్యాదు చేసింది. హెచ్సీఏలో జరిగిన అక్రమాల వెనుక వీరి ఇద్దరి హస్తం ఉందని ఆరోపించింది. హెచ్సీఏ ఎన్నికల్లో జగన్మోహన్రావు గెలిచిన తర్వాత తన విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావులకు అంకితమిచ్చినట్లు చెప్పారని ఫిర్యాదులో పేర్కొంది. వారిద్దరితో పాటు హెచ్సీఏ లోని ఇతర అక్రమార్కులపై కూడా దర్యాప్తు చేయించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సీఐడీని కోరింది.