కామారెడ్డి, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యం యొక్క తూకాన్ని, నాణ్యతను పరిశీలించారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రజా పంపిణీ దుకాణాలలో అధికారులతో ఆర్డీవోలు, జిల్లా పౌరసరఫరాల అధికారి, సహాయ పౌర సరఫరాల అధికారి, తహసిల్దార్లు, డిప్యూటీ తహసిల్దారులు, డిటిసిఎస్, ఆర్ఐలతో తనిఖీలు నిర్వహించారు.
