భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ ఐకేపీ మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా శక్తి కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న స్కూల్ పిల్లల బట్టలను ఏ పీ ఎం రవీందర్ సోమవారం పాఠశాల సిబ్బందికి పంపిణీ చేశారు. భీమ్ గల్ మండల సమాఖ్య& ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా టేలర్ సభ్యులకు స్కూల్ వారీగా 57 స్కూళ్ల కు రవీందర్ ఆధ్వర్యం లో పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏపీఎం రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా చేపట్టిన బట్టలు పంపిణీ సిరియస్ గా తీసుకొని జూన్ 1 వరకు పిల్లలకు డ్రెస్సులు అందించాలని చెప్పడం జరిగిందన్నారు.ఒక జత డ్రెస్ కు 75 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని,ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పెద విద్యార్థులు కు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందండం జరగుతుందని అని అన్నారు. టెలరింగ్ విషయం లో వీ ఓ ఏ,సీసీలు సిరియస్ గా తీసుకొని డ్రెస్సులు కుట్టించే బాధ్యత తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం ఎం ఈ ఓ స్వామి, సీనియర్ సీసీ లు కుంట శ్రీనివాస్,పురాస్తూ నరేష్. సీసీ లు సాయిలు,రఘుపతి, గంగాధర్,భాస్కర్ , లలిత ,సుమలత. మండల సమాఖ్య సిబ్బందిగణేష్,ముత్యం పాల్గొన్నారు.
