నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు సోమవారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.


నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ లలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో సంబంధిత పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయం, ఏసిపి కార్యాలయంలో సంబంధిత అధికారులు, తోటి సిబ్బంది పాల్గొన్నారు.

