నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ లో పేకాట స్థావరంపై సీసీఎస్ టీం మెరుపు దాడి చేసింది. పోలిస్ కమీషనర్ అదేశాల మేరకు అదివారం రాత్రి సీసీఎస్ పోలిసులు దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న వ్యక్తులు అదుపులోకి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోని 8 సెల్ ఫోన్లు , రూ. 22,690 నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం వారిని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు.
