29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఈజిఎస్ నిధులతో సి సి రోడ్లు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,వేల్పూర్ :-మండలం లోని అమీనాపూర్ గ్రామంలో ఎంజిఎన్ఆర్ ఈజిఎస్ నిధుల ద్వారా మంజూరైన సిసి రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.5లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.నిధులు మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆలాగే మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి కి గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ సభ్యులు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేంపల్లి ఇంద్ర గౌడ్, వేంపల్లి లింగా గౌడ్, దేవల నవీన్, కిరణ్ గౌడ్, ఎల్క పల్లి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article