బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఉతాత్మత దివాస్ ను పురస్కరించుకొని రక్తదాని శిబిరం నిర్వహించారు. అయోధ్య రామ మందిర్ గురించి బాబ్రీ మజీద్ అక్రమ కట్టడాన్ని కూల్చడానికి ఎందరో మంది కర సేవకుల ప్రాణ త్యాగాలు చేశారని తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ అందులో భాగంగా రెడ్ క్రాస్ వారి చే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో బజరంగ్దళ్ కార్యకర్తలు, యువకులు ఈ శిబిరంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో విభాగ్ కార్యదర్శి తమ్మలి కృష్ణ, జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్ , కోశాధికారి నాంపల్లి శేఖర్జీ, జిల్లా సహకార దర్శి ధాత్రిక రమేష్, జిల్లా సేవాప్రముఖ్ రాంప్రసాద్ చటర్జీ, నగర కార్యదర్శి బాసొల్లా నీకేష్, బజరంగ్ దళ్ నగర సంయోజక్ ప్యట అఖిల్, నగర సాహసంయోజఖ్ అఖిలేష్, బండి కటేష్, సోను, సుధీర్, రాహుల్, బోయిన్పల్లి కృష్ణ, నితిన్, సంతోష్, గణేష్, సంపత్ రెడ్ క్రాస్ డాక్టర్ రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.
