బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణంలో ప్రతి సంవత్సరం జరుపుకునే సాంప్రదాయ బతుకమ్మ పండుగ ఈసారి కూడా ఘనంగా జరిగింది. పట్టణంలోని కుర్మగల్లీ వాడవాడల మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పాటలతో ఉత్సాహభరితంగా పండుగ ఉత్సాహాన్ని మరింత బలోపేతం చేస్తూ, పిల్లలు, యువత, పెద్దవాళ్లు కూడా పాల్గొని వాతావరణాన్ని బతుకమ్మను పూజ చేసిన అనంతరం, పూల బతుకమ్మలను పాండు చెరువు మరియు చెక్కిచెరువుల్లో నిమజ్జనం చేశారు. భారతీయ హిందూ సంప్రదాయంలో ప్రతి దేవునికి పూలతో పూజ చేయడం ఒక శుద్ధమైన ఆచారం. బతుకమ్మ పండుగ ఈ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ, స్థానిక మహిళల్లో సాంప్రదాయానికి మద్దతు అభిమానాన్ని చూపించింది.ఈ కార్యక్రమంలో సాత్విక, నిత్యశ్రీ, శిరీష, సవిత, నవనీత జాను భాగ్య జై శ్రీ తదితర మహిళలు పాల్గొని, ఉత్సవాన్ని మరింత ఉల్లాసంగా మార్చారు. ఈ సందర్భంగా, స్థానికులు పండుగలో చేర్చిన సాంప్రదాయ కీర్తనలు, జానపద పాటలు, రంగుల పూల అలంకరణలు వలన పండుగకు ప్రత్యేక వైభవం ఏర్పడిందని తెలిపారు.

