బతుకమ్మ, మద్నూర్: మద్నూర్ అయ్యప్ప సేవా సమితి వారు పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు కృషి చేస్తున్నామని అయ్యప్ప స్వాములు పేర్కొన్నారు. అయ్యప్ప సేవా సమితి సన్నిధానంలో మంగళవారం గ్రామానికి చెందిన గల్బేవార్ హన్మంత్ వంద స్టీల్ పెట్లు, వంద స్టీల్ క్లాసులు విరాళంగా అందజేశారు. సన్నిధానం లోని స్వాముల కోసం మద్నూర్ కి చెందిన గల్బేవార్ హన్మంత్ వంద స్టీల్ ప్లేట్లు, వంద స్టీల్ గ్లాస్ లు విరాళంగా అందజేశారు. అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ పర్యావరణ కోసం తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గల్బే వారు హన్మంత్ ,రామ్ పటేల్, రాములు, అయ్యప్ప స్వాములు తదితరులు ఉన్నారు.
