కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్ లో స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి దేవతి శ్రీనివాస్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారు. ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలకు సోమవారం చివరి రోజు కావడంతో నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన వెళ్తుండగా ఈఘటన జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అనుచరులు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు.