సత్యసాయి సమాధిని దర్శించుకున్న మోదీ

పుట్టపర్తి, బతుకమ్మ : ప్రధాని నరేంద్ర మోదీ  బుధవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర మంత్రులు ఘన స్వాగతం పలికారు. సత్యసాయి శత జయంత్యుత్సవంలో ఆయన పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాల్ లో సత్య సాయి మహా సమాధిని మోదీ దర్శించుకున్నారు. అనంతరం హిల్ వ్యూ ఆడిటోరియానికి వెళ్లనున్నారు. బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ. 100 నాణెం, 4 తపాల బిళ్లలు ఆవిష్కరించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు.

Modi visits Sathya Sai Samadhi
Comments (0)
Add Comment