తిరుపతి, బతుకమ్మ: తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయ విమాన గోపుర పనుల్లో భారీ స్థాయిలో గోల్ మాల్ జరిగిందన్నఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం గోపురానికి తొమ్మిది పొరల స్వర్ణ తాపడం చేయాల్సి ఉండగా, కేవలం రెండు పొరలతోనే పని కానిచ్చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వర్ణ తాపడం పనులు జరుగుతున్న క్రమంలో అత్యంత అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల గోపురంపై ఉన్న సుమారు 30 పురాతన విగ్రహాలు దెబ్బతిన్నాయని సమాచారం.