వెబ్ న్యూస్, బతుకమ్మ : అమలాపురం మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. గుండెపోటుతో డిల్లీలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అమలాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఆయన మూడు సార్లు గెలిచారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.