డిల్లీ, బతుకమ్మ : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేత్వత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ ప్రారంభమైంది. ఈమీటింగ్ కు కాంగ్రెస్ నుంచి జైరాం రమేశ్, గౌరవ్ గొగోయ్, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలె,టీడీపీ నుంచి శ్రీ కష్ణదేవరాయలు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, గురుమూర్తి, జనసేన నుంచి బాలశౌరి, బీఆర్ఎస్ నుంచి సురేశ్ హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు, అజెండాను కేంద్రం వివరించనుంది. కాగా, సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
