భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలోని నందిగల్లీ శుక్రరాం దేవి ఆలయ అమ్మవారి ఉత్సవమూర్థుల ఊరేగింపు కార్యక్రమంను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో అర్చకులచే ప్రత్యేక పూజలను నిర్వహింపజేసీ అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకిలో పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం భక్తులకు అన్నధాన కార్యక్రమంను నిర్వహించారు.ఈ కార్యక్రమం లో మూడవ వార్డు కౌన్సిలర్ మూత లత లింబాద్రి, వీడీ సి క్యాషియర్ కాపు కుమ్మరి హరీష్, గల్లీ పెద్దమనుషులు, నందీశ్వర ఫార్మర్స్ యూత్ సభ్యులు, గల్లీవాసులు తదితరులు పాల్గొన్నారు.
