నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జీపీఎస్ కోటగల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ముకుంద్ అనే ఉపాధ్యాయుడికి టీఎస్ పీఎస్సీ ద్వారా గ్రూప్ త్రీ లో ఆడిటర్గా ఉద్యోగం రావడంతో మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ఘనంగా సన్మానించి, ఉపాధ్యాయ విధుల నుంచి రిలీవ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దయానంద్, ప్రసన్న, లక్ష్మి, మమత, సౌందర్య, సంతోష్, నందిని, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.