25.5 C
Hyderabad

చంద్రనగర్‌లో ఘనంగా బోనాల పండగ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలోని డివిజన్ నంబర్ 7 చంద్రనగర్ ప్రాంతంలోని శ్రీశ్రీశ్రీ పుట్ట మైసమ్మ దేవాలయంలో ఆదివారం బోనాల పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ ఆలయానికి చేరుకుని పుట్ట మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. బోనాల పండగ భక్తి భావంతో, సామూహిక ఉత్సాహంతో నిర్వహించడం ఆనందదాయకమని ఆమె పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో చంద్రనగర్ ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మేయర్ ఆకాంక్షించారు. పండగ సందర్భంగా పెద్ద సంఖ్యలో కాలనీవాసులు, భక్తులు, మహిళలు, పిల్లలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయ కమిటీ సభ్యులు మేయర్‌కు సాదర స్వాగతం పలికి, ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు, బోనాల పండగ ఏర్పాట్ల వివరాలను వివరించారు. భక్తుల సమ్మేళనంతో చంద్రనగర్ ప్రాంతం పండగ వాతావరణంతో కళకళలాడిందని మేయర్ అన్నారు. దేవాలయ అభివృద్ధికి, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు తగిన సహకారం అందించాలని మేయర్ సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన దేవాలయ కమిటీ సభ్యులను, పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాలనీవాసులను ఆమె అభినందించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, భక్తి భావాన్ని మరింత పెంపొందిస్తాయని మేయర్ పేర్కొన్నారు.

More articles

Latest article