బతుకమ్మ,మోర్తాడ్: కూలి పని కొరకు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకొడవ గ్రామం నుంచి కూలి పని కొరకు సోమవారం సాయంత్రం మోర్తాడ్ కు వచ్చి మారుతి ఇంటి సెంటర్లో ఉన్నారని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కాకర్ల గోవిందు(54) రాత్రి 8 గంటల సమయంలో బయటకు వెళ్లి కళ్ళు సరిగ్గా కనబడక వారు ఉన్న ప్రదేశం తెలియక మోర్తాడ్ నుండి ఆర్మూర్ వైపు మెయిన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లగా రాత్రి సుమారు 12:40 గంటల సమయంలో గాండ్ల పెట్ గ్రామ సమీపంలోని బ్రిడ్జ్ దగ్గర ఏదో గుర్తు తెలియని వాహనం గుద్దేశి వెళ్లగా రక్త గాయాల అయ్యాయని పెట్రోలింగ్ నిర్వహించు పోలీసులు 108 అంబులెన్స్ నందు నిజామా బాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చనిపోయినాడని భార్య కాకర్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిమని ఎస్సై పేర్కొన్నారు.
