29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఐదవ రోజుకు చేరిన ఐకెపి వివోఏ ల నిరవధిక సమ్మె

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఐకేపి వివోఏల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత కార్యాలయం ఎదుట ఐకెపి వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి ఐదవ రోజుకు చేరింది. ఈ సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. వీవోఏలకు కనీస వేతనం రూ.26,000 వేలు ఇవ్వాలని, పని భారం తగ్గించాలని, అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని, 58 జీవో ను సవరించాలని, వివోఏలకు సాధారణ & ఆరోగ్య బీమా సౌకర్యం రూ.20 లక్షల రూపాయల వరకు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెలో అధ్యక్షురాలు జరీనా, ఉపాధ్యక్షురాలు జిజియా భాయ్, కార్యదర్శి జి.స్వరూప, సహాయ కార్యదర్శి నాగరాణి, కోశాధికారి లావణ్య, బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, నాయకులు కొత్తపల్లి రవి కిరణ్, శివ కుమార్, సాయి కుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article