కిచేన్ కిటికిలు అద్దాలను ధ్వంసం చేసిన అగంతకులు
భిక్కనూరు,బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో దసరా పండగ నాడు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొందరు గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాల చెందిన డైనింగ్ హాల్లోకి తలుపులను తాళం పగలగొట్టి కిటికీ అద్దాలు కప్ బో ర్డును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇటీవలే గ్రామంలోని ఉన్నత పాఠశాలను ప్రాథమిక పాఠశాలను ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నామని, కావాలనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాలలోని డైనింగ్ హాల్లో కిటికీలు, కిటికీ అద్దాలను తలుపులను ధ్వంసం చేశారని ఆరోపించారు పోలీసులు వెంటనే స్పందించి వీటిని ధ్వంసం చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

