. . . డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరు
నిజాంసాగర్, బతుకమ్మ :
నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మందిరంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అనంతరం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరై పోటీలను ప్రారంభించారు.

యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే ఈ తరహా కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. గ్రామ యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. గ్రామ ప్రజలు, నాయకులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

