డిచ్ పల్లి, బతుకమ్మ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీ.జీ ఇంటిగ్రేటెడ్ ఏపీఈ, ఐపీసీహెచ్ కోర్సుల 8 వ సెమిస్టరు పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని బుధవారం వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరిరావు అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డా.టి. సంపత్ తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన అధికారులకు, ఉపాధ్యాయులకు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు సూచనలు చేశారు.

