నవీపేట్, బతుకమ్మ :
బైంసా మున్సిపాలిటి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనా తూమొల్ల దత్తు నాళేశ్వర్ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా బినోల మాజి సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు తన స్వగృహంలో దత్తుకి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపాల్ చైర్మన్ దత్తు మట్లాడుతు నాళేశ్వర్ శివయ్యను మ ఇంటి ఇలవేల్పు గా కోలుస్తామని ,ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చి పూజలు నిర్వహిస్తామన్నారు. ఆ నాళేశ్వర్ శివయ్య ఆశిస్సులు ఆందరి పై ఉండాలని పూజాలు కార్యక్రమం చేయడం జరిగిందన్నారు.అనంతరం మాజి చైర్మన్ మగ్గరి హన్మండ్లు మట్లాడుతూ నాళేశ్వర్ శివయ్య ఆశిస్సులు దత్తు కుటుంబం పై ఉన్నాయని, ఆ దేవుడి ఆశిర్వదంతో తాను బారి మెజార్టీతో గెలుపోంది చైర్మన్ గా ఎన్నికయ్యారన్నారు. మా నాళేశ్వర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధి పనులకు తన వంతు ఎప్పుడు సహాయ సహకారాలు ఆందిస్తామన్నారు.

