భిక్కనూరు, బతుకమ్మ:
భిక్కనూరు మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ గ్రామ దుర్గామాత మండపాలకు ఆదివారం బిజెపి నాయకులు చీరలను అందజేశారు.ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు బత్తుల ఆనంద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని దుర్గామాత మండపాలకు చీరలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ మేరకు దుర్గామాత మండపాల నిర్వాహకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి యువ నాయకులు రాకేష్ ఆదర్శ్ సాయి తరుణ్ హరేంద్ర దుర్గామాత మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
