27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్,  బతుకమ్మ : ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందాడు. ఈఘటన రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ లో  చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  ఎడపల్లి గ్రామ వాసి  శ్రీను గత ఆరు నెలల నుంచి కొందాపూర్ గ్రామంలో అత్త, మేనమామల వద్ద ఉంటూ లేబర్ పని చేస్తుండేవాడు. మద్యం మత్తులో ఆ రహదారి గుండా వెళ్తుండగా  సులేమాన్ నగర్  స్వయంభూ బసవేశ్వర మందిరానికి వెళ్లే రహదారి  పక్కన ఉన్న ముళ్ల పొదల వద్ద ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

More articles

Latest article