నందిపేట్, బతుకమ్మ : నిజామాబాదు జిల్లా కేంద్రం లో గురువారం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి, బోధన్ ఎం ఎల్ ఏ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు నందిపేట్ మండలానికి కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఆర్మూర్ అసెంబ్లీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు నందిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో నందిపేట్ మండలం నుండి భారీ సంఖ్యలో మహిళలు, రైతులు, కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివెళ్లారు.
