24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇసుక టిప్పర్లు ఆపి నిరసన

Must read

📰 Generate e-Paper Clip

ఉపాధి పోయిందని లేబర్ల ఆవేదన

బోధన్ మండలం సిద్దాపూర్ లో ఘటన

బోధన్, బతుకమ్మ : బోధన్ మండలం సిద్దాపూర్ క్వారీ  వద్ద సిద్దాపూర్,కల్దుర్కి గ్రామాల లేబర్లు ఇసుక టిప్పర్లు ఆపి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బోధన్ మండలం సిద్దాపూర్ క్వారీ నుంచి అధికారికంగా వారంలో మూడు రోజులు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తీయడానికి పర్మిషన్  ఇచ్చారన్నారు. ఇప్పుడు ట్రాక్టర్లతో కాకుండా టిప్పర్లకు పర్మిషన్ ఇవ్వడంతో  లేబర్లుగా పనిచేసే వారికి ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  టిప్పర్ల పర్మిషన్ నిలిపివేయాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.

More articles

Latest article