29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రీతం దేశాయ్ కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బోధన్: ఇటీవల బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ప్రీతమ్ దేశాయ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందగా వారి తండ్రి ప్రముఖ న్యాయవాది, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్, తల్లి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సునీత దేశాయ్, కుటుంబ సభ్యులను మంగళవారం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోధన్ లోని వి ఆర్ దేశాయి నివాసంలో ప్రీతమ్ దేశాయ్ చిత్రపటానికి  పుష్పాంజలి తో శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్న గారి జీవన్ రెడ్డి, గిర్దావర్ గంగారెడ్డి టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

MLC Kavitha visits Pritam Desai's family

More articles

Latest article