మెదక్, బతుకమ్మ: మంజీర నదిలో మునిగి హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఏడుపాయల జాతరకు వచ్చిన హైదరాబాద్ కుచెందిన నలుగురు యువకులు తిరు ప్రయాణంలో కొల్చారం మండలం పోతంశెట్ పల్లి శివారులోని బ్రిడ్జి వద్ద మంజీరలోకి దిగారు. స్నానం చేస్తుండగా కృష్ణ(20), షామా(21) నీటిలో గల్లంతయ్యారు. మరో ఇద్దరు యువకులు ఎలాగోలా ఒడ్డుకు చేరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటికి తీయించారు.
