కామారెడ్డి, బతుకమ్మ : పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 8.30 గంటలకు మద్నూర్ మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు కౌలాస్ పూర్ కోటను సందర్శిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు నిజాంసాగర్ ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 1.15 గంటలకు లింగంపేటలో నాగన్న బావిని సందర్శిస్తారు. మధ్యాహ్నం 3. 20 గంటలకు నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలో త్రిలింగ రామేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.సాయంత్రం 4 గంటలకు పోచారం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు.
