25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆర్డీవోకు వినతి పత్రం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని నాలుగో డివిజన్ మాధవ నగర్ (నర్సన్న కాలనీ) వాసులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓకు  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 25 సంవత్సరాల నుండి అధికారులకు ప్రజాప్రతినిధులకు వేడుకుంటూ విన్నపం చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బామండ్ల రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కత్తుల మారుతి , పల్లె మల్లేష్, నర్సింలు గౌడ్, శంకరు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article