నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ పెసిలేషన్ కార్యక్రమం గురువారం జరిగింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో రెండు కలెక్టరేట్ కార్యాలయాల్లో జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 255 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 195 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 126 మంది దరఖాస్తు చేసుకోగా 94 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు.
