- పోలీసులు వేధిస్తున్నారని అఘాయిత్యానికి ఒడిగట్టిన వైనం
- గంజాయి కేసుల కోసం వేధింపులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని మహమ్మదీయ కాలనీ ప్రాంతానికి చెందిన అప్పు అలియాస్ అప్రోజ్ వ్యక్తిపై ఇదివరకు గంజాయి కేసులు ఉన్నాయి. ఇటీవల జైలు నుంచి విడుదలైన వచ్చిన తర్వాత స్థానికంగా రెండు పోలీస్ స్టేషన్ల అధికారులు అతనిపై వేధింపులకు గురిచేశారు. గంజాయి కేసులను పట్టించాలని లేకపోతే మళ్లీ కేసు నమోదు చేసి జైలు కు పంపుతామని బెదిరించారు. దానితో అప్పు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న అప్పు పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. నిజామాబాద్ నగరం, నిజామాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలోని రెండు పోలీస్ స్టేషన్ ల పోలీసుల వేధింపుల కారణంగానే ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


