అమీన్ పూర్, బతుకమ్మ : చీమల ఫోబియాతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో నవ్య కాలనీలో చిందం శ్రీకాంత్, మనీషా దంపతులు నివాసిస్తున్నారు. వీరికి మూడేండ్ల అనికా చిన్నారి ఉంది. మనీషా(25) కు చిన్నప్పటి నుంచి మైర్మెకోఫోబియా అనే వ్యాధి ఉంది.మంగళవారం సాయంత్రం చీరతో ఫ్యాన్ కు ఉరేసుకుంది. చీమలు భరించడం నా వల్ల కాదని అందుకే చనిపోతున్నానని లేఖలో పేర్కొంది. ఈలేఖ ఆమె పక్కన లభించింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అమీన్ పూర్ సీఐ నరేశ్ తెలిపారు.
