. . . ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్ పాల్
నిజమాబాద్ సిటీ, బతుకమ్మ :
పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి బుధవారం వినాయక్ నగర్ లోని డివిజన్ నెంబర్ 45 లో గల గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 368లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం అయన విలేకరులతో మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇందూర్ లో అత్యధిక శాతం రికార్డు నమోదయ్యేలా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ కుటుంబంతో కలిసి హరిచరణ్ మార్వాడి పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

