. . . కార్మిక ప్రజలకు మేడే శుభాకాంక్షలు తెలిపిన వేల్పూర్ భూమయ్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మేడే స్పూర్తితో పోరాటాలు కొనసాగించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. మోపాల్ మండల కేంద్రం లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 140 వ మేడే వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్న కార్మిక ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, 8 గంటల పనిదినాన్ని ఈ దేశంలో మోడీ ప్రభుత్వం 44 చట్టాలను కుదించి 4 కోడ్ లుగా మార్చి పని గంటలను పెంచుతున్నారన్నారు. దీనితో పాటు వ్యవసాయ రంగంలో తెచ్చిన నల్ల చట్టాల వల్ల ఆ రంగంలో రైతులు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని వారన్నారు. వీటికి నిరసనగా కార్మిక ప్రజలు, రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బలమైన సమర శిలా ఉద్యమాలు మేడే పోరాట స్ఫూర్తితో కొనసాగించాలని వారు కోరారు.
