బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విశ్వకర్మ జయంతి కార్యక్రమం విశ్వకర్మ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కన్నోజ్ వార్ ప్రభాకర్ చారి, రాష్ట్ర స్వర్ణకార సంఘం సహాయ కార్యదర్శి మారోజు సుధాకర్ చారి, ప్రధాన కార్యదర్శి కుందనం రమేష్ చారి, కోశాధికారి నారోజు వెంకటరమణాచారి, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు హనుమాన్లు చారి, ఉపాధ్యక్షులు కొలనుప్యాక శ్రీనివాస్ చారి, కాసాల నాగరాజు చారి, కిషోర్ చారి, ప్రధాన కార్యదర్శి త్రివేణి నాగరాజు చారి పాల్గొన్నారు. అలాగే మనమయ సంఘం నాయకులు వడ్ల గంగాధర్ చారి, నేరెళ్ల అశోక్ చారి, బక్కన్నగారి రమేష్ చారి, యంజెర్ల నరేష్ చారి, సత్యనారాయణ చారి, ఎం.బ్రహ్మం చారి, నారోజు బ్రహ్మం చారి తదితరులు హాజరయ్యారు.
