కాణిపాకం వినాయక స్వామి రూపంలో అందరినీ ఆకట్టుకుంటున్న విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం గణేష్ మండలి

0 1,134

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నగరంలోని గాజుల్ పేట్ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంగం అద్భర్యం లో ఈ సంవత్సరం ఏర్పాటుచేసిన గణేష్ మండలి లో శ్రీ కాణిపాకం వర సిద్ది వినాయక స్వామి రూపం లో విగ్రహాన్ని నిర్వాహకులు ప్రతిష్టించారు. కాణిపాకం లో ఉండే విగ్రహం మాదిరిగానే విగ్రహంలో నుండి నీరు వచ్చే విధంగా ప్రత్యేకంగా తయారు చేశారు. దీంతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలాడుతున్నారు. ఇక్కడ గణేష్ విగ్రహాన్ని చూస్తుంటే అనితాకంలో ఉన్న వినాయకుని చూసిన అనుభవం కలుగుతుందని గణేష్ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.