26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కార్యదర్శి, సిబ్బంది పనితీరు బేష్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ పిట్లం
రాంపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి సిబ్బంది పనితీరు భేష్ అని ఎంపీడీవో కమలాకర్ అభినందించారు. ఎంపీడీవో,ఎంపీవో రాంపూర్ గ్రామపంచాయతీని శుక్రవారం సందర్శించి గ్రామపంచాయతీలోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ సిబ్బందికి ఓటరు జాబితాను సకాలంలో పూర్తి చేసినందుకు రాంపూర్ పంచాయతీ సెక్రెటరీ భాస్కర్ ను అభినందించారు .వారితో పాటు సిబ్బందిని కూడా అభినందించారు. పిట్లం మండల గ్రామ పంచాయతీ కార్యదర్శిలు సకాలంలో జాబితాను పూర్తి చేసి అందించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో,ఎంపిఓ యాదగిరి,రాంపూర్ (కలన్) గ్రామ పంచాయతీ సెక్రెటరీ భాస్కర్, గ్రామ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అంజ గౌడ్,కారోబార్ కృష్ణ,గ్రామ పంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article