. . . 2 కోట్లు స్వాధీనం.. ఇద్ధరి సస్పెన్షన్
వెబ్ డెస్క్, బతుకమ్మ :
ప్రభుత్వ ఉద్యోగుల్లో లంచగొండులు రకరకాలు. ఇదిగో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఈ భార్యాభర్తలు చూడండి. ఇంట్లో దాదాపు రెండు కోట్ల రూపాయలు పైగా అక్రమంగా వసూలు చేసిన డబ్బులు పూజ గదిలో పెట్టుకుని ప్రతిరోజు భార్య పూజ చేసి, భర్తకు తిలకం పెట్టి డ్యూటీ కి వెళ్తుంటుంది. రోజురోజుకీ లంచాల డబ్బు పెరిగి పోవాలని తాము కోట్లకు పడగ ఎత్తాలని కోరుకుంటుంది. ఆమె చదివే మంత్రాలు కూడా అవే. ఆమె ఇలా డబ్బుకు రోజూ పూజలు చేసుకుంటూ మంత్రాలు చదువుకుంటుంటే ఓ యువకుడు దాన్ని వీడియో గా తీశాడు. తీయడమేమో తమాషాగా తీశాడు. ఈ వీడియో వైరల్ అయింది. దీంతో అగర్తలలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న భార్యాభర్తలు ఇద్దరినీ అధికారులు సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పూజ గదిలో ఉన్న డబ్బు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. పూజ ఈ విధంగా ఫలించింది. తిక్క కుదిరింది లంచగొండి భార్యాభర్తలకు.

