సభ్య దేశాలకు మోదీ కీలక ప్రతిపాదన
వెబ్ న్యూస్, బతుకమ్మ : బిమ్ స్టెక్ సదస్సు కోసం థాయ్ లాండ్ పర్యటన లో ఉన్న ప్రధాని మోదీ కీలక ప్రతిపాదన చేశారు.ఈదేశాల మధ్య చెల్లింపు వ్యవస్థలతో యూపీఐ అనుసంధానం కోసం పిలుపునిచ్చారు. దీంతో సభ్య దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం, పర్యటకం పెరుగుతోందని వ్యాఖ్యనించారు. అలాగే బిమ్ స్టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.