నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 29 న నిజామాబాద్ పాలిటెక్నిక్ మైదానం లో జరిగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఆయన వెంట నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఉన్నారు.
