| వేల్పూర్, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న రెండు లారీలు( టారాజ్) లు సీసీఎస్ పోలీసులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం తో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలతో సీసీఎస్ పోలీసులు బుధవారం తెల్లవారు జామున దాడులు నిర్వహించారు. రెండు లారీలు సీజ్ చేసి, ఇద్దరు డ్రైవర్లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు, డ్రైవర్ లను వేల్పూర్ పోలీసులకు అప్పగించారు. |