నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఇన్ స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో వెయిటింగ్ లో ఉన్న ఐదుగురు సివిల్ సీఐలను మల్టీ జోన్-1 పరిధిలో బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏ వెంకటేశ్వరరావును ఆదిలాబాద్ జిల్లా బోథ్ సర్కిల్ కు, పి కరుణాకర్ ను రామగుండం సీఎస్ బీకి బదిలీ చేయగా, నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ కు మొదుగు రమేశ్ ను, పాండేరావును ఆదిలాబాద్ డీసీఆర్ బీకి, ఎస్. శ్రీధర్ ను ఆసిఫాబాద్ సీసీఎస్ కు బదిలీ చేశారు.
