బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు బాలుర ఉన్నత పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ లో సోహం అకాడమీ, ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో రోబోటిక్స్ పై 50 మంది విద్యార్థులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకి బేసిక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఆడ్రినో బోర్డు, వివిధ రకాల సెన్సార్లు పని చేసే విధానంపై 21 కృత్యాలు చేయించి 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి సర్టిఫికెట్లు అందజేశారు. ఎంపికైన విద్యార్థులకు రానున్న రోజుల్లో సిల్వర్ , గోల్డ్ ,డైమండ్, ప్లాటినం వంటి చాలెంజెస్ ఉంటాయని వీటిని సకాలంలో పూర్తి చేయాలని సోహం అకాడమీ మెంటర్ వర్షిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సుజాత , అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్చార్జ్ టీచర్ తమ్మల రాజు, సైన్సు ఉపాధ్యాయులు సరిత, వృతివిద్య శిక్షకులు ప్రసన్న లు పాల్గొన్నారు.


