నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలోని పీహెచ్ సీలకు చెందిన మెడికల్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని హోటల్ వంశీ ఇంటర్నేషనల్ లో సూపర్ వైజర్ సప్లైమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి లు గా జిల్లా ఆరోగ్య శాఖా అధికారి రాజ శ్రీ, మహిళా శిశు సంక్షేమ శాఖా అధికారిణి యస్ కె రసూల్ బీ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో సీ డి పి వో లు, సూపర్ వైజర్ లు పోషణ్ అభియాన్ యస్ యస్ యఫ్ పీ సమన్వయ కర్తలు యన్ రాంబాబు, గోపాల కృష్ణ, ప్రకాష్, యూనిసెఫ్ రాష్ట్ర స్థాయి ప్రతినిధులు డాక్టర్ క్యాతి తివారి, నర్సింహా రావు, యస్ యస్ యఫ్ పీ కార్యక్రమం అమలు పైన అతితీవ్ర లోప పోషణ (SAM )పిల్లల స్క్రీనింగ్ పద్ధతుల పైన శిక్షణ ఇచ్చారు.

