బతుకమ్మ కమ్మర్ పల్లీ: కమ్మర్ పల్లీ మండల కేంద్రంలో సోమవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భోగి, సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గులు వేయడంలో మంచి ప్రతిభ చూపించిన మహిళలకు బహుమతులు అందజేయడం జరిగింది. మొదటి స్థానంలో జక్కాని వీణ, రెండవ స్థానంలో జిందం జ్యోతి, మూడవ స్థానంలో పావని, నాలుగో స్థానంలో రూప బహుమతులు గెలుచుకున్నారు. కార్యక్రమం మండల అధ్యక్షుడు చింత తిరుపతి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.